నేరస్థుల అడ్డాగా ఆంధ్రాను తయారు చేస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. టీడీపీ పాలనలోని సంక్షేమ పథకాలను ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ మెడలు వంచుతా అని చెప్పారని.. ప్రత్యేక హోదా ఏమైంది అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో రోడ్ షోలో పాల్గొన్నారు చంద్రబాబు. టీడీపీ మేయర్ పదవిని సాధించాలని, లేదంటే విజయవాడ జనం తలెత్తుకు తిరగలేరన్నారు. ఓ మంత్రి పేకాట ఆడిస్తూ..తప్పేముంది అంటున్నారని.. పరోక్షంగా కొడాలి నానిపై విమర్శలు చేశారు చంద్రబాబు.